• This is Slide 1 Title

    This is slide 1 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 2 Title

    This is slide 2 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

  • This is Slide 3 Title

    This is slide 3 description. Go to Edit HTML and replace these sentences with your own words. This is a Blogger template by Lasantha - PremiumBloggerTemplates.com...

Tuesday, August 18, 2020

#ప్రభాస్ 22 వ చిత్రం.....!



ఎట్టకేలకు ప్రభాస్ తన సర్ ప్రైస్ రివిల్ చేశాడు బాలీవుడ్ లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చేసాడు  T సిరీస్ నిర్మించబోతున్న #ADIPURUSH అనే మూవీలో ప్రభాస్ నటించబోతున్నట్లు ఈ చిత్రానికి ఓం రావత్ దర్శకత్వం వహిస్తున్నట్లు ప్రభాస్ తన ఇన్స్ట్రాగ్రామ్ లో వీడియో షేర్ చేశారు

#చిరంజీవి 152 వ చిత్రం...!




 చిరంజీవి 152 చిత్రం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఆగస్టు 22 సాయంత్రం 4 గంటలకు విడుదల చేయబోతున్నట్లు రామ్ చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు #we are ready with first look and motion poster of#chiru152.meet you on August 22nd at 4pm!! అని ఆయన ట్వీట్ చేశారు

Monday, August 17, 2020

#ప్రభాస్ సర్ ప్రైజ్...!


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత చాలా క్రేజ్ సంపాదించిన ఈ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు ప్రభాస్ నుండి సర్ప్రైస్ రాబోతుంది రేపు ఉదయం 7:11 నిమిషాలకు తనకు సంబంధించి సర్ ప్రైజ్ ఉంటుందని  ఇన్స్ట్రా  గ్రామ్ లో ఒక చిన్న వీడియో షేర్ చేశాడు ప్రభాస్ అయితే బాలీవుడ్ లో ప్రభాస్ డైరెక్ట్ సినిమా తీస్తున్నాడని... హృతిక్ రోషన్ తో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నానని , ఈ సినిమాను T సిరీస్ నిర్మిస్తున్నట్లు పుకార్లు వస్తున్నాయి

ప్రముఖ సంగీత విద్వాంసుడు..పండిట్ జస్ రాజ్ కన్ను మూత...!




భారతీయ సాహిత్య గాయకుడు అత్యుత్తమ గౌరవ పద్మ విభూషణ్ గ్రహీత 8 దశాబ్దాలుగా గాయకుడు పండిత్   జస్ రాజ్ గారు ఈరోజు పరమవదించారు

దంచికొడుతున్న వానలు 868 మంది మృతి!



దేశంలో వారం రోజులుగా వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా కురుస్తున్న వానలు దీంతో జులై నెల చివర్లో నమోదైన వర్షపాత లోటును తుడిచిపెట్టేల విపరీతంగా వానలు కురుస్తున్నాయి నాలుగు నెలల సీజన్ లో నమోదైన వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే అధికంగా103% గా ఉంది ఆగస్టు19 న బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ( ఐఎండి )తెలిపింది దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గతంలో కురిసిన వర్షాలకు అస్సాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, మేఘాల‌యాలోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షభీబ‌త్సం చాలామందిని బ‌లిగొన్న సంగ‌తి తెలిసిందే. భారీ వర్షం కారణంగా కేరళలో కొండచరియలు విరిగిపడి 55 మంది మృతి చెందారుఆగ‌స్టు 12 నాటికి దేశంలోని 11 రాష్ర్టాల్లో కురిసిన  భారీ వ‌ర్షాల కార‌ణంగా 868 మంది ప్రాణాలు కోల్పోయార‌ని మంత్రిత్వ శాఖ నివేదిక‌లో వెల్ల‌డించింది. గ‌త ఏడాది ఇదే సీజ‌న్‌లో 908 మంది చ‌నిపోయారు. ఈ సంవ‌త్స‌రం కూడా అసాధార‌ణ‌మైన వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. జైపూర్ లోని ఓ ప్రాంతంలో కేవ‌లం ఆరు గంట‌ల స‌మ‌యంలోనే 25 సెం.మీ. వ‌ర్షం న‌మోద‌వ‌గా ,  గ‌త 24 గంట‌ల్లో రాజ‌స్తాన్,ఒడిశా, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ర్టాల్లో భారీ వ‌ర్షాలు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ సీనియ‌ర్ శాస్త్రవేత్త ఆర్.కె. జెనమణి అన్నారు.ఆగ‌స్టు నెల‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు మూడు అల్ప‌పీడ‌నాలు ఏర్ప‌డ్డాయి. హిమాల‌యాల నుంచి రుతుప‌వ‌నాలు వేగంగా వీస్తున్నాయ‌ని దీంతో ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వ‌ర్షాపాతం న‌మోదైన‌ట్లు వెల్ల‌డించారు

Sunday, August 16, 2020

తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు ఈ జిల్లాల వారు అప్రమత్తంగా ఉండాలి !

రాష్ట్రంలో మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తూనే ఉన్నాయి ఇవాళ్ళ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది వరంగల్, భూపాలపల్లి, ములుగు ,అదిలాబాద్, కొమరం భీమ్, పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల్, జగిత్యాల జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశముందని ఈ జిల్లాల వారు వారు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది