Monday, August 17, 2020

దంచికొడుతున్న వానలు 868 మంది మృతి!



దేశంలో వారం రోజులుగా వివిధ రాష్ట్రాల్లో విస్తృతంగా కురుస్తున్న వానలు దీంతో జులై నెల చివర్లో నమోదైన వర్షపాత లోటును తుడిచిపెట్టేల విపరీతంగా వానలు కురుస్తున్నాయి నాలుగు నెలల సీజన్ లో నమోదైన వర్షపాతం దీర్ఘకాలిక సగటు కంటే అధికంగా103% గా ఉంది ఆగస్టు19 న బంగాళాఖాతంలో మరో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ( ఐఎండి )తెలిపింది దీంతో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గతంలో కురిసిన వర్షాలకు అస్సాం, అరుణాచ‌ల్ ప్ర‌దేశ్, మేఘాల‌యాలోని కొన్ని ప్రాంతాల్లో వ‌ర్షభీబ‌త్సం చాలామందిని బ‌లిగొన్న సంగ‌తి తెలిసిందే. భారీ వర్షం కారణంగా కేరళలో కొండచరియలు విరిగిపడి 55 మంది మృతి చెందారుఆగ‌స్టు 12 నాటికి దేశంలోని 11 రాష్ర్టాల్లో కురిసిన  భారీ వ‌ర్షాల కార‌ణంగా 868 మంది ప్రాణాలు కోల్పోయార‌ని మంత్రిత్వ శాఖ నివేదిక‌లో వెల్ల‌డించింది. గ‌త ఏడాది ఇదే సీజ‌న్‌లో 908 మంది చ‌నిపోయారు. ఈ సంవ‌త్స‌రం కూడా అసాధార‌ణ‌మైన వ‌ర్ష‌పాతం న‌మోదైంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు. జైపూర్ లోని ఓ ప్రాంతంలో కేవ‌లం ఆరు గంట‌ల స‌మ‌యంలోనే 25 సెం.మీ. వ‌ర్షం న‌మోద‌వ‌గా ,  గ‌త 24 గంట‌ల్లో రాజ‌స్తాన్,ఒడిశా, ఛ‌త్తీస్‌ఘ‌డ్ రాష్ర్టాల్లో భారీ వ‌ర్షాలు న‌మోదైన‌ట్లు వాతావ‌ర‌ణ శాఖ సీనియ‌ర్ శాస్త్రవేత్త ఆర్.కె. జెనమణి అన్నారు.ఆగ‌స్టు నెల‌లోనే ఇప్ప‌టివ‌ర‌కు మూడు అల్ప‌పీడ‌నాలు ఏర్ప‌డ్డాయి. హిమాల‌యాల నుంచి రుతుప‌వ‌నాలు వేగంగా వీస్తున్నాయ‌ని దీంతో ఈశాన్య రాష్ర్టాల్లో భారీ వ‌ర్షాపాతం న‌మోదైన‌ట్లు వెల్ల‌డించారు

0 comments:

Post a Comment